మా తెలుగు తల్లికి మల్లెపూ దండ
అంటూ చిన్నప్పుడు తెలుగు తల్లిని పొగుడ్తూ రాసిన పాటను వింటూ లేచేవాడిని . ఈ సారి ఏమి లేదాయ్ .. .. ..
నిన్న తెలుగు భాషా దినోత్సవం. ప్రతీ ఏటా శ్రీ గిడుగు రామమూర్తి గారి జన్మదినం పురస్కరించుకుని మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము.
ఐతే ఈ సరి ఎందుకో మరిచి పోయాను. మా మావయ్య గుర్తు చెయ్యడం తో నాకు తట్టింది. ఇలా మర్చిపోవడం ఏమిటీ అని నా మీద నాకు చికాకు వేసింది .
ఎం చేస్తాం .. ఈ కాలం మహిమ; అన్ని ఈ కాలమ్స్ రాసి , చదివి అసలుకే ఎసరు పెట్టినట్టైంది. ఇంకా ఇంట్లో ఈనాడు పేపర్ రావడం తో నాలో ఇంకా తెలుగు బతికే ఉంది. కనీసం నా వంతు రెండు పదాలు అన్నట్టు ; ఈనాడు ఆదివారం పుస్తకం లో పద వినోదం చేయడం ప్రారంభించాము - నేను, మా ఆవిడ, అబ్బాయి.
అవి అర్ధం చేసుకుని తగిన పదాలు రాయడానికి చాలా కష్ట పడ్డాను. నా తెలుగు ఏడ్చినట్టుంది. ముక్కుతూ మూలుగుతూ , ముగ్గురం కలిసి పూర్తి చేసాము. కొంచెం కష్ట పడ్డా, చాలా ఇష్టం గా చేసాము - ఇది నాకు బాగా నచ్చింది. పైగా ముగ్గురం కలిసి ఒక పని చెయ్యడం అన్నది అరుదైపోయింది ఈ మధ్య.
తెలుగు నన్ను నన్నుగా చేస్తుంది, నాలో ఆలోచన తట్టి లేపుతుంది. మాటల్లో చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది . అందుకే దాన్ని మాతృ భాష అంటారేమో . భాష ద్వారా భావం వ్యక్తమైతే ; ఆ భావం భావి తరాలకి మనం ఇచ్చే అమూల్యమైన ఖజానా.
ఇక నుంచి కనీసం ప్రతీ రోజు తెలుగులో రాయాలని నిశ్చయించుకున్నా .....
No comments:
Post a Comment